ATP: పుట్లూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.