చిత్తూరు: వి.కోట మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ, నందమూరి అభిమానుల సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు దామోదర్ నాయుడు అలియాస్ బుల్లెట్ నాయుడు జనసేనలో చేరారు. ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ జెండా కప్పుకున్నాడు. యువ రాజకీయాలకు జనసేనాని సిద్ధాంతాలు ఆదర్శంగా ఉన్నాయని అతడు కొనియాడారు. భావితర రాజకీయానికి యువతను ప్రోత్సహించడంతో ఆ పార్టీలో చేరానని చెప్పారు.