Interim Bail To Delhi Cm Arvind Kejriwal : మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం(Delhi Cm) అరవింద్ కేజ్రీవాల్కు ఎట్టకేలకు సుప్రీం కోర్టులో(Supreme Court) ఊరట లభించింది. కోర్టు ఆయనకు శుక్రవారం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. మిగిలిన అంశాలపై విచారణ కోసం ఈ కేసును విస్తృత ధర్మాసనానికి సుప్రీం కోర్టు బదిలీ చేసింది. కేజ్రీవాల్ తనది అక్రమ అరెస్టు అంటూ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఇప్పుడు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించనుంది.
చదవండి : స్విమ్మింగ్ పూల్లో కరెంట్ షాక్.. హైదరాబాద్లో 16 మందికి గాయాలు
ఢిల్లీ మద్యం పాలసీని(Liquor Policy) రూపొందించడంలో కేజ్రీవాల్ అవకతవకలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో ఆయనకు రూ.100 కోట్లు ముట్టాయని అంటోంది. ఈ విచారణలో భాగంగా కేజ్రీవాల్ని మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ఆయనకు గత నెలలో బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈడీ ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో హైకోర్టు కింద కోర్టు తీర్పుపై స్టే విధించింది. విచారణ అనంతరం బెయిల్ని రద్దు చేసింది.
చదవండి : చైనా నుంచి పాక్కి నిషేధిత రసాయనాలు.. స్వాధీనం చేసుకున్న భారత్
దీంతో బెయిల్ విషయంలో అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఎట్టకేలకు నేడు ఆయనకు మధ్యంతర బెయిలు(Interim Bail) లభించింది. ఈ కేసులో బెయిల్ లభించినప్పటికీ ఆయన తీహార్ జైలు నుంచి బయటకు రావడం దాదాపుగా కుదరని పనే. ఆయనపై ఇప్పటికే సీబీఐ కేసు కూడా ఉంది. ఆ కేసులో కేజ్రీవాల్ ఇప్పటికే అరెస్టయ్యారు. దాని విచారణ జరుగుతోంది. దానిలోనూ బెయిల్ లభిస్తే తప్ప ఆయన బయటకు రావడం కష్టమే.

