ELR: రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ కొరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తున్నారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 60 లక్షల విలువైన ఆరు వాహనాలను పోలీసు వ్యవస్థకు అంకితం చేశారు. వాటినీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.