KMR: పట్టణంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి దుండగులు పుస్తెల తాడు అపహరించుకుని పారిపోయినట్లు సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అశోక్ నగర్కు చెందిన భాగ్యమ్మ శనివారం కాలనీలోని కిరాణా షాపుకు నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో నుంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడు లాక్కెళ్లారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.