ADB: కేంద్రంలో జరగనున్న దసరా ఉత్సవాల ఏర్పాట్లను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఆయన ముందుగా బంగల్ పేట్ మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఉత్సవాలు, దుర్గా నిమజ్జన శోభాయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి తుదితులు పాల్గొన్నారు.