KMM: తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి వైరా రిజర్వాయర్ను నిన్న సందర్శించి, ఏపీ-తెలంగాణ రాష్ట్రాలు నీటి వాటాల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అన్నారు. నైజాం కాలం నాటి ఈ పురాతన ప్రాజెక్టు ద్వారా 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఈ రిజర్వాయర్కు కృష్ణా, గోదావరి జలాలను అనుసంధానం చేసిందని తెలిపారు.