GDWL: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నడిగడ్డ హక్కుల పోరాట సమితి (NHPS) తరఫున పోటీ చేసేందుకు సిద్ధం కావాలని ఆ సంస్థ జిల్లా ఛైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ ధరూర్ మండల ముఖ్య నాయకులతో కలిసి బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు.