కొండమల్లేపల్లి పంచాయతీ ఎన్నికల్లో ఓ వార్డు సభ్యుడు తనకే ఓటు వేయాలని ఓటుకు 2 తులాల వెండి విగ్రహాన్ని అందజేసి ఓటు వేయాలని ప్రమాణం చేయించుకున్నాడు. అనంతరం విగ్రహాలు ఇచ్చిన వ్యక్తినే ఓటర్లు గెలిపించారు. విగ్రహాలు ఇటీవల పరీక్షించగా నకిలీవని బయటపడ్డాయి. ఓటు కోసం నమ్మించి మోసం చేసిన ప్రజాప్రతినిధులను, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు.