BDK: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు జీవో నెంబర్ 22 అమలు చేసి, వేతనాలు పెంచాలని కోరుతూ.. సీఐటీయు ఆధ్వర్యంలో సింగరేణి జాయింట్ కమిషనర్ దేవరాజుకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ప్రతినెల 7వ తేదీలోపు వేతనాలు ఇచ్చే విధంగా కృషి చేయాలి అన్నారు. అదేవిధంగా ప్రొఫెషనల్ టాక్స్ మినహాయింపు ఇచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.