AP: కోనసీమ జిల్లా ఇరుసుమండలో 5 రోజుల క్రితం సంభవించిన ONGC బ్లోఅవుట్ మంటలు ఎట్టకేలకు పూర్తిగా ఆరిపోయాయి. మంటలకు దగ్ధమైన భారీ మెషినరీ శకలాలను క్రేనుల సహాయంతో ONGC సిబ్బంది తొలగించింది. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు వాటర్ అంబ్రెల్లాతో పాటు గ్యాస్ బావి వద్ద అమర్చేందుకు బ్లోఅవుట్ ప్రివెంటర్ను సిద్ధం చేశారు.