ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఈనెల 25 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది. కాగా, ఎన్నికల బరిలో ఎన్డీయే పక్షాల అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నిలిచారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.