NTR: జగ్గయ్యపేట పట్టణం సీతారామపురంనకు చెందిన గంధం పద్మ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఇల్లు దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య శుక్రవారం కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అగ్ని ప్రమాదంలో దగ్ధమైన గృహాన్ని పరిశీలించి, బాధిత కుటుంబానికి తగిన సాయం అందించేందుకు తక్షణం అధికారులను ఆదేశించారు.