కృష్ణా: కొత్త చట్టాలపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని నూజివీడు రూరల్ సీఐ రామకృష్ణ కోరారు. నూజివీడు సర్కిల్ పరిధిలోని ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాలు ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రతి ఒక్కరు బాధ్యతతో పోలీసులకు సమాచారం అందించాలన్నారు.