టీటీడీ చైర్మన్ నియామకం వివాదాస్పదమైంది. భూమన కరుణాకర్ రెడ్డి అన్యమతస్తుడు అని.. ఆయనను చైర్మన్ పదవీ నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హిందూ సంస్థలు, భక్తులు కోరుతున్నారు.
ప్రజా యుద్ధనౌక, గాయకుడు గద్దర్ అసలు పేరు తెలుసా? ఇతని అసలు పేరు గుమ్మడి విట్టల్ రావు. ఇతను తెలుగు సంస్కృతిని ప్రోత్సహించడంలో ప్రసిద్ధి చెందాడు. దీంతోపాటు తన గురించి మరికొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పైన అంతా చీకటి, చేజారితే కింద గోదావరిలో పడిపోవడం ఖాయం. కానీ ఓ చిన్నారి ఒక పైపును పట్టుకొని 6 గంటలు తీవ్రంగా శ్రమించింది. ఎంత అరిచినా ఎవరు లేరు. తన తెలివితేటలను ఉపయోగించి ప్రాణాలు కాపాడుకుంది.
ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బైక్ వెనక వైపు కూర్చొన్న వ్యక్తి ప్రమాదంలో మరణించినా కూడా వారికి బీమా వర్తిస్తుందని వెల్లడించింది.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలోని 21, ఆంధ్రప్రదేశ్లోని 18 స్టేషన్లు సహా దాదాపు 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi) ఆదివారం(ఆగస్టు 6న) శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ఆయా స్టేషన్లలో(railway stations) రైల్వే మౌలిక సదుపాయాలను మరింత అప్గ్రేడ్ చేయనున్నారు.
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బూరుగుపూడి గేటు సమీపంలో కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు యువకులు మృత్యువాత చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే స్నేహితులంతా కలిసి మారేడుమిల్లి విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. మృతులు ఉదయ్ కిరణ్, హర్షవర్ధన్, హేమంత్ గా గుర్తించారు. వీరు ఏలూరు శ్రీరామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులుగా తె...
ఏపీలో విద్యుత్ రంగ ఉద్యోగులు మహాధర్నాను చేపట్టనున్నారు. అలాగే నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు.
వైసీపీ నేతలు, పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అన్ని వ్యవస్థల్నీ సీఎం జగన్ నాశనం చేసేశారని మండిపడ్డారు.
విశాఖ కానిస్టేబుల్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ప్రియుడు రామారావు కోసమే భార్య శివాని హత్య చేసినట్లు విచారణలో తేలింది.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ట్రోల్స్ చేస్తోంది. లాయర్లకు ఇచ్చే ఫీజుల విషయం గురించి విజయసాయిరెడ్డి పార్లమెంట్లో ప్రసంగించారు. ఈ తరుణంలో ఆయన వ్యాఖ్యలను టీడీపీ ట్రోల్స్ చేయడం చర్చనీయాంశమైంది.
పుంగనూర్ ఘర్షణకు కారణం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని టీడీపీ నేతలు అంటున్నారు. అతనిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్ను కలిసి విన్నవించారు.
ప్రియుడి మోజులో భర్త చంద్రశేఖర్ను హతమార్చింది భార్య భువనేశ్వరి. హత్య చేసి.. తనకు ఏమీ ఎరగనట్టు పోలీసులకు ఫోన్ చేసింది. సందేహాం కలిగి విచారిస్తే.. అసలు నిజం తెలిసింది.
పుంగనూర్ ఘర్షణలు కుప్పానికి పాకాయి. అక్కడ ఆర్టీసీ బస్సును వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారని తెలిసింది. బస్సుపై దాడి జరిగిన సమయంలో అందులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
వర్షాల కారణంగా నది ఉధృతంగా ప్రవహిస్తున్నా కూడా సరే వైద్యం కోసం కర్రలతో పడవను చేసి దాటుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(chandrababu naidu), ఆయన కుమారుడు నారా లోకేష్(nara lokesh)లకు భద్రత కల్పించిన వివరాలను సమర్పించాలని కేంద్ర హోంశాఖ శుక్రవారం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు భద్రత కల్పిస్తున్నారా లేదా అంటూ ప్రశ్నిచింది.