KDP: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు మళ్ళీ మొదటికొచ్చినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివేకా కుమార్తె సునీత రెండు వారాల్లో పూర్తి వివరాలతో సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఒకవేళ కోర్టు CBI విచారణకు ఆదేశిస్తే MP అవినాష్ రెడ్డికి ఇబ్బందులు తప్పకపోవచ్చని, ఈసారి అరెస్టు నుంచి ఆయన తప్పించుకోలేరని విశ్లేషకులు చెబుతున్నారు.