GNTR: జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ మంగళవారం దుగ్గిరాల పోలీస్ స్టేషన్ను సందర్శించారు. నేరాలు, చోరీల నియంత్రణకు మండలంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్సై వెంకటరవితో కలిసి ఎస్పీ పరిశీలించారు. అనంతరం స్టేషన్లోని రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.