VSP: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్వస్థ్ నారీ, స్వశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని మహిళలు పూర్తిగా వినియోగించుకోవాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు శనివారం కోరారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించబడిందన్నారు.