KDP: గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లె వద్ద జరిగిన వెంకటరమణ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ కృష్ణమోహన్ గురువారం తెలిపారు. ఈనెల 22వ తేదీన రాత్రి బోరెడ్డిగారిపల్లె వద్ద జరిగిన నాటక ప్రదర్శనలో ఇరువురు మధ్య తలెత్తిన వివాదం హత్య వరకు దారితీసిందని అన్నారు. కోపంతోనే వెంకటరమణను, రమణారెడ్డి అతని ఇద్దరు కుమారులు చంపినట్లు తేలింది.