SKLM: శ్రీకాకుళం నుంచి ప్రయాగరాజ్లో జరిగే మహాకుంభమేళాకు ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ స్పెషల్ బస్ సర్వీస్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం నుంచి ఫిబ్రవరి 8వ తేదీన రాత్రి 8 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందని ప్రకటించింది. ఈ బస్సు ద్వారా జగన్నాథ స్వామి, సూర్య దేవాలయం, లింగరాజ్ ఆలయం, కుంభమేళా వంటి వాటిని సందర్శించవచ్చు.