W.G: ఆర్డీఎస్ఎస్ పనుల కారణంగా 33/11 కేవీ చినకాపవరం విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో ఈనెల 22 శనివారం ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. పెదకాపవరం, చినకాపవరం, మహాలక్ష్మిపురం, రామాయగూడెం, క్షత్రియపురం, తరటావా, గుమ్ములూరు, అరేడు, క్రొవ్విడి, పాములపర్రు గ్రామాల్లోని ఆక్వా చెరువుల లైన్లలో కరెంటు సరఫరా ఉండదన్నారు.