GNTR: వైద్యఖర్చుల నిమిత్తం పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను మంగళవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పంపిణీ చేశారు. తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో పంపిణీ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధిని పూర్తిగా దుర్వినియోగం చేసిందని, కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.