ప్రకాశం: ఈనెల 17న ఉదయం 11 గంటలకు కనిగిరి మండల పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ కార్యాలయ పరిపాలన అధికారి జి ఫ్రాన్సిస్ బాబు మంగళవారం తెలిపారు. కనిగిరి మండలంలోని మండల స్థాయి అధికారులు అందరూ సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని తెలిపారు. మండలంలోని ప్రజా ప్రతినిధులు సమావేశానికి హాజరుకావాలని పేర్కొన్నారు.