GNTR: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మంగళవారం ఆమె క్యాంప్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ‘మీతోనే నేను – మీ వెంటే నేను’ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి, పనుల నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ స్థలాల నిర్వహణపై నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు.