KDP: మెంథా తుఫాన్ నేపథ్యంలో, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్ బుధవారం వల్లూరు మండల పరిధిలోని ఆదినిమ్మాయపల్లి ఆనకట్టను పరిశీలించారు. ఆనకట్ట స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మైలవరం డ్యాం నుండి పెన్నా నదికి నీరు వదలడం వల్ల ఆనకట్టకు నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.