KRNL: బిహార్లో ఈ నెల 9, 10 తేదీల్లో జరిగిన ఆసియా స్థాయి రగ్బీ ఛాంపియన్షిప్లో కర్నూలుకు చెందిన అక్షయ కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా శుక్రవారం మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ తన ఛాంబర్లో అక్షయను శాలువా కప్పి, షీల్డ్ అందించి సత్కరించారు. అనంతరం బాలికలు రగ్బీ క్రీడల్లో రాణించడం శుభ పరిణామమని అభిప్రాయపడ్డారు.