KKD: దీపావళి సామాగ్రి తయారీదారులు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కోరంగి ఎస్సై సత్యనారాయణ హెచ్చరించారు. శనివారం ఆయన తాళ్లరేవు మండలం జి. వేమవరంలోని దీపావళి సామాగ్రి తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. రానున్న పండుగ సందర్భంగా తయారీదారులు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పాటించాల్సిన నిబంధనలను గురించి ఈ సందర్భంగా ఎస్సై వారికి వివరించారు.