PPM: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమైతే మానసిక ప్రశాంతత సొంతం చేసుకోవచ్చని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం పట్టణం నాలుగు రోడ్ల కూడలి వద్ద వెలసిన దుర్గ తల్లి అమ్మవారు ఆలయ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వేడుకలకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా దుర్గ తల్లిని దర్శించుకొని అనంతరం అన్న ప్రసాద వితరణలో పాల్గొన్నారు.