కృష్ణా: కరకట్ట వెంబడి అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. దివిసీమకు కృష్ణానది వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే శుక్రవారం మోపిదేవి మండలం ఉత్తర చిరువోల్లంకలో ఔట్ ఫాల్ స్లూయీజ్ పరిశీలించారు. ఐదు లక్షలకు తగ్గకుండా వరద కొనసాగుతున్న పరిస్థితిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.