E.G: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలో నీటమునిగిన పంటపొలాలను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుని, అవసరమైన సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజల, రైతుల భద్రత కోసం ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.