విశాఖ పద్మనాభం మండలం తునివలసలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు ఇవాళ ఏడీపీఎం శ్యామల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పీఎండీఎస్’ పద్ధతి ద్వారా ఏడాది పొడవునా పంటలు పండించవచ్చని, సీడ్ పెల్లటైజేషన్ వల్ల విత్తన నాణ్యత పెరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.