బిల్కిస్ బానో కేసులో భారత సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది నిందితుల క్షమాభిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గుజరాత్ ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది.
Bilkis Bano: బిల్కిస్ బానో కేసులో భారత సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది నిందితుల క్షమాభిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గుజరాత్ ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది. క్షమాభిక్ష ఇచ్చిన 11 మందిని 2 వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. జస్టిస్ బీబీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ తర్వాత ఈ తీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణ మహారాష్ట్రలో జరగడం వల్ల దోషులకు రెమిషన్ మంజూరు చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని తెలిపింది. అలాగే ఈ కేసులో రెమిషన్ కోరుతూ దోషి చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలంటూ 2022 మార్చిలో సుప్రీంకోర్టు మరో బెంచ్ ఇచ్చిన ఆదేశాలపైన తాజా ధర్మాసనం స్పందించింది.
Bilkis Bano case: Supreme Court quashes remission order of Gujarat government
గుజరాత్లో 2022లో గోద్రా రైలు దహనకాండ తర్వాత అల్లర్లు చెలరేగాయి. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో గర్భిణి అయిన బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008, జనవరి 21న జీవిత ఖైదు విధించింది. దోషులు 15 ఏళ్లుగా కారాగారంలోనే ఉన్నారు. అయితే తమను విడుదల చేయాలంటూ ఓ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతనిని పరిశీలించాలని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో నిందితులందరికీ రెమిషన్ మంజూరు చేయాలని కమిటీ తెలిపింది. దీంతో వీళ్లను 2022 ఆగస్టు 15న రిలీజ్ చేసింది. దీనిపై విమర్శలు వెల్లువత్తాయి. దీనిని సవాల్ చేస్తూ బిల్కిస్ బానోతో పాటు మరికొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ క్షమాభిక్షను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.