MBNR: మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటవ డివిజన్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మహబూబ్నగర్ మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. గురువారం ఉదయం మున్సిపల్ కమిషనర్ రామానుజులు రెడ్డితో కలిసి డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.