JGL: ఇబ్రహీంపట్నం మండలం గోదూరు వర్షకొండ గ్రామాల్లోని రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను రైతులు వీక్షించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.