NDL: జూపాడుబంగ్లా మండల కేంద్రానికి చెందిన అశోక్ (30) అనే యువ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పది ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న, పొగాకు పంటలు సాగు చేస్తున్న అతనికి గత ఐదేళ్లుగా నష్టాలు చవిచూశాయి. అప్పులు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లికార్జున శుక్రవారం తెలిపారు.