JGL: వెల్గటూర్ మండలం చెగ్యాంలో సోమవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు నివారణ ఉచిత టీకాలు వేశారు. పశువైద్య సిబ్బంది డాక్టర్ పీ. శ్రీ ప్రియ, కే. సంధ్య (LSA), నాగరాజు, నారాయణ, రాంకుమార్, చంద్రయ్య, అంజి పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 48 ఆవులు, ఎద్దులు, 32 గేదెలకు టీకాలు వేశారు. సర్పంచ్ కుమ్మరి మహేశ్వరి పాల్గొన్నారు.