PLD: నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, వాటికి త్వరగా పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.