TPT: తిరుపతి రూరల్ పరిధిలోని RC రెడ్డి డిగ్రీ కళాశాలలో APSSDC ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య ప్రతి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. ఇందులో భాగంగా 11 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని స్పష్టం చేశారు. అనంతరం పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, బి. ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. కాగా, మొత్తం 550 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.