ప్రకాశం: పట్టణంలోని వుడ్ కాంప్లెక్స్, జయప్రకాష్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ ప్రాంతాలలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని డీఈ పాండురంగారావు తెలిపారు. మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.