NLG: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,136 రెవెన్యూ గ్రామాల్లో భూ భారతి గ్రామసభలు నిర్వహించారు. మొత్తం 1,01,605 దరఖాస్తులు ప్రజల నుంచి స్వీకరించారు. ఇందులో మిస్సింగ్ సర్వే నంబర్లు, ఫౌతితో పాటు అసైన్డ్ భూముల సమస్యలు, పెండింగ్ మ్యుటేషన్ దరఖాస్తులు అధికంగా వచ్చాయి. ఈ దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కరించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తుంది.