NLG: రైతు భరోసా పథకం కింద నల్గొండ జిల్లాలో శనివారం వరకు 4 లక్షల 97 వేల 280 మంది రైతులకు రూ.592.55 కోట్లను రైతుల ఖాతాలలో జమ చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. విడతల వారీగా నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు. ఖరీఫ్ సాగు పెట్టుబడికి వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.