ATP: అనంతపురం నగరంలోని మెడికల్ కళాశాల ఎదుట శనివారం PDSU విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి వీరేంద్ర మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయంతో వెనుక బడిన వర్గాల పిల్లలకు వైద్య, విద్య దూరమయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ ప్రతిపాదన ఉప సంహరించుకోవాలన్నారు.