ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ నిరాశపరిచాడు. 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన అతడు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. కేవలం నాలుగు బంతులు ఎదుర్కొన్న అతడు స్టోక్స్ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. కాగా, తొలి టెస్టు ఆడుతున్న సాయి సుదర్శన్ను కూడా స్టోక్స్ డకౌట్ చేసిన విషయం తెలిసిందే.