కడప: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎంఈఓ పద్మజ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒంటిమిట్ట మాధవరం-1 పంచాయతీ వెంకటేశ్వరపురం హైస్కూల్లో ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు యోగాసనాలు చేశారు. ఎంఈఓ మాట్లాడుతూ.. యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చునన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.