SRD: జహీరాబాద్ పట్టణ పరిధిలోని రంజోల్లో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవం గురువారం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు. గణపతి పూజ, పంచామృత అభిషేకం, దత్త హోమం, పూర్ణాహుతి, హారతి, అన్నప్రసాద కార్యక్రమలు ఉంటాయని వారు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుడు ఆశీస్సులు పొందగలరని కోరారు.