ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని గ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు 14వ రోజు బుధవారం సందడిగా, వినోదంగా కొనసాగాయి. ముందుగా విద్యార్థులతో లైబ్రరీన్ విజయభాస్కర్ రెడ్డి కథలు చదివించడం, కథల్లోని నీతిని వివరించడం పాటలు పాడించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల్లో పఠనాశక్తిని వెలికి తిసేందుకు, వారిలో దాగి ఉండే ప్రతిభను గుర్తించడం ఏర్పాటు చేశామన్నారు.