NLR: కోవూరు (మం) పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైవేపై అదుపు తప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లగా, ఇంట్లోని వ్యక్తితోపాటు, ఐదుగురు మెడికల్ విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన బాధాకరమని, గాయాలతో బయటపడ్డ వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.