PLD: మాచర్ల మాజీ ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి శవ రాజకీయాలు మానుకోవాలని మాచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వీరాస్వామి అన్నారు. మాచర్ల మండలం పసువేములలో మామ అల్లుళ్ల మధ్య భూ వివాదంలో 4 నెలల క్రితం అల్లుడిని మామ గొడ్డలితో నరికితే ఇప్పటికీ అల్లుడు కోమాలో ఉన్నాడన్నారు. ఆ కక్ష్యతో అల్లుడి తల్లితో పాటు కుటుంబ సభ్యులు మామను హత్య చేసి చంపారన్నారు.