సత్యసాయి: రేషన్ షాపుల ద్వారా 16 రకాల నిత్యవసర వస్తువులను ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆద్వర్యంలో పెనుకొండ ఆర్డీవోకి 200 మందితో సంతకాలతో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా శ్రీ సత్యసాయి జిల్లా నాయకురాలు గౌతమి, అంజనా దేవి, స్థానికులు సుమిత్ర, కావేరి, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.