SKLM: టెక్కలిలోని అయ్య ప్పనగర్లో ఉన్న ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతిగృహాన్ని మంగళవారం ఉదయం టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై విద్యార్థులతో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం వసతిగృహ పరిసరాలను పరిశీలించారు. వసతిగృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆర్డీవో సిబ్బందికి సూచించారు.